బాలయ్య హోస్ట్ గా చేస్తున్నా బిగ్గెస్ట్ హిట్ టాక్ షో. అన్ స్టాపబుల్.
సినిమా తారల నుంచి.పొలిటికల్ లీడర్ల వరకూ అందరినీ షోకు తీసుకు వస్తూ.
వారి మనోగతాలను ప్రజలకు వివరిస్తూ ఉన్నారు.అన్ స్టాపబుల్ షో స్టార్ట్ అయిన దగ్గరి నుంచి.
ఒకే క్రేజ్ తో దూసుకు పోతూ మొదటి సీజన్ ను ముగించింది.ఇక రెండో సీజన్ లో మాంచి స్పీడు పెంచి రాజకీయ నాయకులను షోకు తీసుకుదావడం మొదలు పెట్టారు ఆహా టీమ్.
రెండో సీజన్ ను మాజీ ముఖ్యమంత్రి, నందమూరి బాలకృష్ణ బావ అయిన నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు.
రాజకాయాల్లో ఆయనపై ఉన్న విమర్శలు అన్నిటినీ.ఒక్క షోతో కడిపారేశారు, బాలయ్యా.ఆ తర్వాత విభజన టైంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని షోకు పిలిపించి ఆయన మనోగతాన్ని పంచుకున్నారు.
ఇప్పుడు ఏకంగా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ను షోకు పిలిపించి.ఆయన పై ఉన్న రాజకీయ విమర్శలకు చెక్ పెడుతున్నారు.ఇంతవరకూ అందరిపైనా వస్తున్న విమర్శలను కడిగేసిన బాలయ్య.ఇప్పుడు తనపైన వచ్చిన విమర్శలకు చెక్ పెట్టనున్నారు.
వీరసింహారెడ్డి ఫంక్షన్లో అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపండంతో బాలయ్య స్పందించి వివరణ ఇచ్చుకున్నారు.అయినా విమర్శల వేడి తగ్గకుండా.రాజకీయ రంగు పులుముకుంది.దాంతో అది పొలిటికల్ కెరియర్ కు నష్టం చేసే అవకాశం ఉండటంతో.ఆయన అక్కినేని నాగార్జునను షోకు పిలిపించేందకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.ఇంతకాలం రాజకీయాల్లో క్లీన్ అండ్ గ్రీన్ గా ఉన్న బాలయ్యపై అక్కినేని ముద్ర.
ఇబ్బందిగా మారింది.దాన్ని ఈ షోతో క్లీన్ చేసుకోవాలని ఆయన భావిస్తూ ఉన్నారు.
అక్కినేని వారసులను షోకు పిలిపించి.మాట్లాడితే.
పొలిటికల్ గా విమర్శలు చేస్తున్న వారికి చెక్ పెట్టోచ్చు అనేది బాలయ్య ఆలోచన.మరి అంతా భావిస్తున్నట్టు అక్కినేని వారసులు బాలయ్య షోకు వస్తారా అనేది కొత్త ప్రశ్న.