న్యాచురల్ స్టార్ నాని వేగంగా సినిమాలలో నటించడంతో పాటు సినిమాల ద్వారా విజయాలను ఖాతాలో వేసుకుంటున్నారు.శ్యామ్ సింగరాయ్ తో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న నాని అంటే సుందరానికి సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు.
ప్రముఖ టాలీవుడ్ నటి విజయదుర్గ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి తర్వాత తనకు భర్తతో గొడవలు జరిగాయని ఆమె అన్నారు.
తన భర్తకు ఆటిట్యూడ్ ఉందని ఆ ఆటిట్యూడ్ వల్ల గొడవలు జరిగాయని విజయదుర్గ చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఆమె వెల్లడించారు.తాను సీరియల్ లో చేయడంతో తేజ గారి తర్వాత సినిమాలలో ఆఫర్లు రాలేదని అనుకుంటున్నానని ఆమె అన్నారు.
తాను ఏడాదికి ఒకసారి తేజగారికి కాల్ చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు.తేజసార్ మూవీస్ లో నాకు గాడ్ ఫాదర్ అని ఆమె తెలిపారు.
తేజ సార్ నన్ను హీరోయిన్ అని పిలుస్తారని ఆమె చెప్పుకొచ్చారు.అమ్మానాన్న చనిపోయిన సమయంలో బాగా ఏడ్చానని ఆమె అన్నారు.ఎక్కువ టేక్స్ తీసుకుని ఒకసారి మేనేజర్ తో తిట్లు తిన్నానని ఆమె వెల్లడించారు.నా షాట్ వల్ల షూట్ లేట్ కావడంతో మేనేజర్ తిట్టారని ఆమె చెప్పుకొచ్చారు.
చిరంజీవి, పవన్, మహేష్, సోనూసూద్ తో చేయాలని ఉందని ఆమె తెలిపారు.ప్రస్తుతం నాని పక్కన చేస్తున్నానని అమె చెప్పుకొచ్చారు.
![Telugu Chiranjeevi, Mahesh, Pawan, Shyam Singaray, Sonu Sood, Sonusood, Vijayadu Telugu Chiranjeevi, Mahesh, Pawan, Shyam Singaray, Sonu Sood, Sonusood, Vijayadu](https://telugustop.com/wp-content/uploads/2022/04/Pawan-Mahesh-Sonu-Sood-Shyam-Singaray.jpg)
నాని గారిని ఫోటో దిగాలని అడగగా మనకు ఇంకా షూటింగ్ ఉంది కదా దిగుదాం అని అన్నారని గెటప్ బయటకు రాకూడదని ఫోటో దిగలేదని ఆమె తెలిపారు.సినిమాలో కీర్తి సురేష్ చాలా ముద్దుగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.దర్శకులు తనకు తగ్గ పాత్రలు రాయాలని ఆమె కామెంట్లు చేశారు.విజయదుర్గ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి
.