హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో( Shamshabad Airport ) చొరబడిన చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.చిరుతను బంధించేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు.
చిరుత సంచారం నేపథ్యంలో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు ( Forest officials )ఐదు బోనులను ఏర్పాటు చేసిన మేకను ఎరగా వేశారు.అదేవిధంగా 25 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలోనే ఒకే ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయింది.బోను దగ్గర వరకు వచ్చినప్పటికీ చిరుత చిక్కడం లేదని తెలుస్తోంది.
అయితే నాలుగు రోజులుగా చిరుతను బంధించేందుకు ప్రత్యేక బృందం అధికారులు ప్రయత్నిస్తున్నారన్న సంగతి తెలిసిందే.కాగా శంషాబాద్ విమానాశ్రయం ప్రాంగణంలో చిరుత సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.