రేపు మేడిగడ్డను సందర్శించనున్న కేంద్ర కమిటీ..!

మేడిగడ్డ ప్రాజెక్టు భద్రతను పరిశీలించేందుకు కేంద్రం నియమించిన కమిటీ రేపు తెలంగాణకు రానుంది.ఈ మేరకు కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది.

 The Central Committee Will Visit Medigadda Tomorrow..!-TeluguStop.com

ఈ కమిటీ రేపు ప్రాజెక్టును సందర్శించి కేంద్రానికి నివేదిక అందించనుంది.మేడిగడ్డ డ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర బృందాన్ని పంపాలని లేఖ రాశారు.

ప్రాజెక్టు డిజైన్ నుంచి ప్రాజెక్టు నిర్మాణం వరకు తీసుకున్న నిర్ణయాలపై వాస్తవాలు తేల్చాలని కిషన్ రెడ్డి లేఖలో కోరిన సంగతి తెలిసిందే.దీంతో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనను సీరియస్ గా తీసుకున్న కేంద్రం నిజాలను తేల్చేందుకు కమిటీని నియమించింది.

అయితే ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube