రాష్ట్రంలో భూములన్నీ జగన్ కే కావాలి..: చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు.ఇసుక, గనులు, మద్యం డబ్బులతో జగన్ దాహం తీర్చుకుంటున్నారని విమర్శించారు.రాష్ట్రంలో ఉన్న భూములు అన్నీ జగన్ కే కావాలన్న చంద్రబాబు ఇసుక ద్వారా సీఎం జగన్ రూ.40 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.ఈ క్రమంలో ఇసుక ప్రజలకు అందాలి కానీ దోపిడీకి గురి కాకూడదని తెలిపారు.ఉచిత ఇసుక విధానంతో లక్షల మందికి మేలు జరిగిందన్నారు.జగన్ తీరు కారణంగా 130 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు.ఇసుక దోపిడీపై ప్రశ్నించినందుకు రాజమండ్రిలో ఓ వ్యక్తికి శిరోముండనం చేశారని ఆరోపించారు.

 Jagan Wants All The Lands In The State..: Chandrababu-TeluguStop.com

ఇసుక మాఫియా వలన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 48 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.వైసీపీ పాలనలో ప్రాజెక్టుల మెయింటనెన్స్ లేదు, గ్రీజ్ కూడా వేయడం లేదని మండిపడ్డారు.

రిజర్వాయర్లు సైతం ఎండిపోయే పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube