ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ నివాసంలో భారీ చోరీ జరిగినట్లు తెలుస్తోంది.చెన్నైలోని ఆమె ఇంటిలో సుమారు 60 సవర్ల బంగారం, వజ్రాభరణాల జ్యుయలరీ అపహరణకు గురైనట్లు తెయాన్ మెట్ పోలీసులకు ఫిర్యాదు అందిందని సమాచారం.
లాకర్ లో ఉంచిన నగలు కనిపించడం లేదని ఐశ్వర్యా రజనీకాంత్ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఐశ్వర్య ప్రస్తుతం లాల్ సలామ్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.