పశ్చిమగోదావరి జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడి చేశారు.
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
కోడిపందాలు నిర్వహించేవారిలో రాజకీయ నేతలున్నట్లు సమాచారం.అనంతరం పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలుస్తోంది.