భారత్ – చైనా సరిహద్దులో ఘోర ప్రమాదం జరిగింది.సిక్కింలోని జిమా ప్రాంతంలో సైనిక వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడింది.
ఈ ఘటనలో 16 మంది భారత జవాన్లు దుర్మరణం చెందారని సమాచారం.పలువురు జవాన్లకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
సిక్కింలోని ఓ ప్రమాదకర మలుపు వద్ద వాహనం అదుపు తప్పింది.ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.