తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు.దీంతో ఆయనను సూరారంలోని ఆస్పత్రికి తరలించారు.
అయితే మహేందర్ రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఐటీ అధికారులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో ఐటీ అధికారులతో మంత్రి మల్లారెడ్డి వాగ్వివాదానికి దిగారు.
అనంతరం అధికారులను పట్టించుకోకుండా ఆస్పత్రికి వెళ్లిపోయారు.దీంతో మల్లారెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.
కాగా మంత్రి మల్లారెడ్డి సహా ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి.