కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో దారుణం జరిగింది.రామకృష్ణకాలనీలో ఇద్దరు మహిళలపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడి తల్లీకూతురుపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.ఈ ఘటనలో సులోచన అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.
తల్లి బాలవ్వ తీవ్రగాయాలపాలైంది.గుర్తించిన స్థానికులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.