ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోయిదాలో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.29 సర్వే నెంబర్ లోని 44 ఎకరాల భూములు స్వాహా అయినట్లు సమాచారం.ఈ భూ కుంభకోణంలో ఆరుగురు వ్యక్తులతో పాటు రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉందని గిరిజనులు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో భూ స్కామ్ ను నిరసిస్తూ తహసిల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన మహిళలు ధర్నాకు దిగారు.
అధికారులు ఈ కుంభకోణంపై విచారణ జరిపి, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.