కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు బ్రేక్ పడింది.ప్రస్తుతం కేరళలో ఆయన పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అయితే, ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆయన ఢిల్లికి వెళ్లారు.పార్టీ సీనియర్లతో సమావేశమై ప్రెసిడెంట్ ఎన్నికపై చర్చించనున్నారు.
తిరిగి రేపు యధావిధిగా పాదయాత్రను కొనసాగించనున్నారు.