టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ సమంత.తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
తన అందంతో ఎంతోమంది కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది.అతి తక్కువ సమయంలో స్టార్ హోదా ను సంపాదించుకుంది.
ఇక తొలిసారిగా ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఇక ఆ సమయంలోనే తనతో కలిసి నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.
పెళ్లి తర్వాత సమంత మరింత యాక్టివ్ గా మారింది.సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుంది.పెళ్లి తర్వాత నాగచైతన్య తో కలిసి సినిమాలలో నటించింది.బుల్లితెర ప్రకటనల్లో కూడా నటించింది.
పలు వ్యాపారాలు కూడా ప్రారంభించింది.ఈ జంట టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ క్యూట్ కపుల్ గా అందరి మనసులను ఫిదా చేశారు.
సినీ తారలు సైతం జలసీ గా ఫీల్ అయ్యేలా ముచ్చటగా తిరిగే వారు ఈ జంట.కానీ గత ఏడాది ఈ క్యూట్ కపుల్స్ విడిపోయి టాలీవుడ్ ప్రేక్షకులందరికీ షాక్ ఇచ్చారు.తమ సోషల్ మీడియా వేదికగా తమ విడాకుల గురించి ప్రకటించారు.ఇక విడాకుల అనంతరం ఇద్దరు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు.సమంత మాత్రం బాగా యాక్టివ్ గా మారింది.ఒంటరిగా ఉంటూ మరింత ధైర్యాన్ని పెంచుకుంది.
పైగా అవకాశాలు కూడా బాగానే అందుకుంటుంది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన వర్కవుట్లు వీడియోలను, ట్రెండీ ఫోటోలను బాగా పంచుకుంటుంది.క్లీవేజ్ షో లతో నెటిజన్లను బాగా రచ్చరచ్చ చేస్తుంది.పొట్టి బట్టలతో గ్లామర్ లుక్ లతో అందర్నీ తన వైపు మలుపుకుంటుంది.సంపాదన పరంగా సమంత బాగా సంపాదిస్తుందని చెప్పవచ్చు.
ఇక నాగచైతన్య కూడా తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.ఇదంతా పక్కన పెడితే తాజాగా మళ్లీ సమంత, నాగ చైతన్య ఒకటవ్వబోతున్నట్లు తెగ పుకార్లు వినిపిస్తున్నాయి.ఇంతకూ అసలు విషయం ఏంటంటే.డైరెక్టర్ నందిని రెడ్డి చైతు, సామ్ విడాకులు జరగక ముందు వీరిద్దరితో ఒక మూవీ తెరకెక్కించాలని అనుకున్నారట.అలా ఇద్దరికీ నందిని రెడ్డి కథ కూడా వినిపించిందని తెలిసింది.
ఇక ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారట.
కానీ ఆ సమయంలోనే ఆమెకు బ్రేకులు పడ్డాయి.ఈ సినిమాకు సంబంధించిన పనులతో బిజీగా ఉన్న నందినీ రెడ్డికి చైతూ, సామ్ విడాకులతో పెద్ద షాక్ ఇచ్చారు.
కానీ ఇప్పుడు నందిని రెడ్డి మళ్లీ ఎలాగైనా వీరిద్దరిని కలిపి సినిమా చేయాలనే పట్టుదలతో ఉందని తెలిసింది.పైగా నాగచైతన్యను, సమంత ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.
దీంతో ఈ సినిమాతో వీరిద్దరి మనసులు మారి మళ్లీ ఒకటవ్వాలని తన అభిమానులు నెట్టింట్లో కామెంట్లు పెడుతున్నారు.