శేరిలింగంపల్లి, మియాపూర్: మియాపూర్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్లపల్లి వింటేజ్ వివర్స్ ను ప్రముఖ నటి “కిలాడీ” సినిమా హీరోయిన్ డింపుల్ హయతి పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆమె షోరూం అంత తిరిగి నూతన ఏర్పాటు చేసిన చీరలను పరిశీలించారు.
కొత్త మోడల్స్ ఆవిష్కరించారు.
అనంతరం విలేకరుల సమావేశం లో మాట్లాడిన చిల్లపల్లి వింటేజ్ లో అద్భుతమైన చీరలు అందు బాటులో ఉన్నాయాన్నారు.
ముఖ్యంగా కంచిపట్టు, హ్యాండ్లూమ్స్ అన్ని రకాల చీరలు అందుబాటు ధరలకు ఏర్పాటు చేయడం పట్ల ఆమె నిర్వాహకులను అభినందించారు.
చిల్లపల్లి వింటేజ్ మరిన్ని బ్రాంచ్ లు ఏర్పాటు చేయాలనీ ఆమె ఈ సందర్బంగా కోరారు.
ఇంత మంచి షోరూం ఏర్పాటు చేసిన నిర్వకులను అభినందించారు.