ఈ మధ్యకాలంలో డిజిటల్ కంటెంట్ ఎక్కువగా విపరీతమైన ప్రాచుర్యం పొందుతోంది.ముఖ్యంగా రియాల్టీ షోలు, టాక్ షోల ట్రెండ్ ఊపందుకుంటోంది.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్థాపబుల్ షో ఊహించని విధంగా విజయం సాధించింది.ఈ టాక్ షో తో బాలయ్య బాబు అందరి ఆలోచనా విధానాన్ని మార్చేశాడు.
తనలో ఉన్న మరొక టాలెంట్ నిరూపిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించాడు బాలయ్య బాబు.వరల్డ్ రికార్డు నెలకొల్పిన ఈ షో సంచలనం అని చెప్పవచ్చు.
అయితే బాలకృష్ణ స్పూర్తితో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఒక రియాల్టీ షోకి సిద్ధమయ్యింది.
ఈ షో కి సంబంధించి అధికార ప్రకటన కూడా జరిగింది.
బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ తో చేతులు కలిపి కంగనా లాక్ అప్ పేరుతో ఒక రియాల్టీ షోని నడపనుంది.ఈ షోకి కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరించబోతోంది.
అంతేకాకుండా షోను చాలా అడ్వెంచరస్ గా రూపొందిస్తున్నట్టు సమాచారం.ఏఎల్ టి బాలాజీ,ఎం ఎక్స్ ప్లేయర్ లో ఈ షో ప్రసారం కానుంది.
అయితే ఈ షో లో ప్రముఖ కమెడియన్ వీర్ దాస్ పాల్గొంటున్నట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.ఈ విషయంపై స్పందించిన వీర్ దాస్ ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ కొట్టిపారేశాడు.
ఈ షో కోసం ఎవరు నన్ను సంప్రదించలేదు.అంతే కాకుండా నాకు షోపై ఆసక్తి కూడా లేదు.కంగనా రనౌత్ టీమ్ కీ నా బెస్ట్ విషెస్ అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు.ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అలాగే సదరు వార్తలు రాసిన జర్నలిస్టులపై కూడా సెటైర్లు వేశాడు.షో విషయానికి వస్తే లాక్ అప్ రియాల్టీ షో 72 ఎపిసోడ్ గా ప్రసారం కానుంది.
ఇక మొత్తం 16 మంది సెలబ్రిటీలు ఈ షోలో పాల్గొనబోతున్నారు.వారందరినీ కూడా జైలు గదిలో ఉంచుతారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ షో సల్మాన్ ఖాన్ కీ కంగనా రనౌత్ ఛాలెంజ్ విసిరింది.మీలాంటి అల్లాటప్ప షో కాదని, లాక్ అప్ షో మామూలుగా ఉండదు అంటూ సల్మాన్ ఖాన్ ను రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేసింది.