జిల్లాల పునర్విభజన విషయంలో ఎవరి అభిప్రాయాలు తీసుకోలేదు సొంత పార్టీ వ్యవహారంలాగా వ్యవహరించారు అనేక జిల్లాల్లో స్థానిక సంఘాలు, ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు 13జిల్లాల్లో ఆయా జిల్లాల అభివృద్ధి కి పని చేసిన మహానుభావులు ఉన్నారు వారి పేర్లను, అక్కడి ప్రజల మనోభావాలను జగన్ పట్టించుకోవడంలేదు క్యాసినో వ్యవహారం చూసి రాష్ట్ర ప్రజలు ఉలిక్కి పడ్డారు దీనిని దృష్టి మళ్లించడానికే ఆఘమేఘాల మీద 26జిల్లాల అంశాన్ని తెర పైకి తెచ్చారు ఈ జిల్లాల పునర్విభజన వల్ల చిన్న ఉద్యోగం అయినా కొత్తగా ఇవ్వగలరా అమ్మకు అన్నం పెట్టలేనోడు చిన్నమ్మకు పట్టుచీర కొంటా అన్న విధంగా జగన్ తీరు ఉంది ఉన్న ఉద్యోగాలను పీకేసి… ఉన్నవారికి జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి కడపకు వైయస్సార్ జిల్లా పెట్టిన విధంగా… ఇతర జిల్లాల్లో ఉన్న గొప్పవారి పేర్లను పెట్టాలి.
రాజకీయ పార్ట, ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే పేర్లు పెట్టాలి వైసిపి నేతలకు అనుకూలంగా జిల్లాలపేర్లు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం గౌతులచ్చన్న, బాలయోగి, యస్వీ రంగారావు, పేర్లు పెట్టాలని అడుగుతున్నారు యన్టీఆర్ బాల్యం గడిచిన తూర్పు కృష్ణాకు ఆయన పేరు పెట్టాలి విజయవాడ లో పేదల కోసం నిరాహారదీక్ష చేస్తూ రంగా ప్రాణాలు అర్పించారు విజయవాడ వైపు వంగవీటి మోహనరంగా జిల్లాగా పేరు పెట్టాలి ఈ డిమాండ్ తో శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు సభలు జరుగుతున్నాయి వంగవీటి మోహనరంగా విగ్రహం లేని ప్రాంతం లేదు అటువంటి మహానేత పేరు పెట్టకపోతే జగన్ ఆయన్ని అవమానించినట్లే
ప్రభుత్వం ఇటువంటి వారి పేర్లు పెడితే వచ్చిన ఇబ్బంది ఏమిటో చెప్పాలి తాడేపల్లి ప్యాలెస్ నుండి ఒక్కరు కూడా ఈ డిమాండ్ లపై మాట్లాడరా రంగా అనే వ్యక్తి అన్ని వర్గాల వారికి ఆరాధ్య నాయకులు రంగా పేరు పేరు పెట్టకపోతే చరిత్ర హీనులవుతారనేది వాస్తవం ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఎటువంటి ఖర్చు కూడా అవ్వదు తూర్పు కృష్ణా కు యన్టీఆర్, విజయవాడ కు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాల్సిందే ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాం… వైసిపి స్పష్టమైన ప్రకటన చేయాలి పది రోజుల నుంచి అడుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు అందుకే రేపు విజయవాడ ధర్నా చౌక్ లో వేలాది మందితో దీక్ష చేపడుతున్నాం అవసరతే సిఎం ఇల్లు ముట్టడికి కూడా సిద్దమవుతాం