సినిమా పరిశ్రమలో దశాబ్దాల తరబడి కొనసాగిన నటులు తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది ఉన్నారు.వారిలో చాలా మంది ఇంటి దగ్గరే ఉండి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు.
అటు మరికొంత మంది వయసు ఎంత పెరిగినా.ఇప్పటికీ సినిమా రంగంలో రాణిస్తూనే ఉన్నారు.
ఏడు పదుల వయసు దాటిని ఇంకా ఉత్సాహంగా సినిమాలు చేస్తూనే ఉన్నారు.ఇంతకీ వయసు మీద పడినా సినిమాలపై మోజు తగ్గని సినీ జనాలు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
*తెలుగు సినిమాతో బాగా అనుబంధం ఉన్న బాలయ్య వయసు 91 సంవత్సరాలు.ఈయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటున్న ఆయన.సినిమా పరిశ్రమకు చెందిన కార్యక్రమాలకు వస్తున్నాడు.
*ఉషాకిరణ్ మూవీస్ వ్యవస్థాపకుడు రామోజీరావు వయసు 85 సంవత్సరాలు.ఆయన ఇప్పటికీ ఎన్నో సినిమాలు నిర్మించాడు.ఇప్పటికీ నిర్మిస్తూనే ఉన్నాడు.
*శారద వయసు 77 ఏండ్లు ఆమె ఇప్పటికీ వెండి తెరపై దర్శనం ఇస్తూనే ఉంది.
*కైకాల సత్యనారాయణ వయసు 87 ఏండ్లు.ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేశాడు.
*తెలుగులో ఎన్నో ఆణిముత్యాలను తెరకెక్కించాడు కె.విశ్వనాధ్.ఆయన ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటున్నాడు.
*నటి వాణిశ్రీ వయసు 74 ఏండ్లు.
ఒకప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగొందిన ఆమె.ఇప్పుడు కూడా సినిమాల్లో నటించేందుకు సరే అంటుంది.
*86 ఏండ్ల జమున కూడా ఇప్పటికీ డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.100 సినిమాలకు పైగా ఆమె నటించింది.
*సీనియర్ నటుడు శరత్ బాబు వయసు కూడా 71 ఏండ్లు.ఆయన ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
*75 ఏండ్ల రమప్రభ పలు సినిమాల్లో నటించింది.కొంత కాలం క్రితం సినిమాలకు దూరమైన ఆమె ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నది.
* సినియర్ నటుడు వయసు 73 ఏండ్లు, రాఘవేంద్రరావు వయసు 81 ఏండ్లు, చలపతిరావు వయసు 78 ఏండ్లు అయినా ఇప్పటికీ ఎంతో చలాకీగాసినిమాలు చేస్తున్నారు.కాంచన 83 సంవత్సరాలు, చంద్రమోహన్ 77 సంవత్సరాలు, మురళీ మోహన్ 82 సంవత్సరాలు, కృష్ణ వయసు 79 సంవత్సరాలు వీరంతా 50 ఏండ్లకు పైగా సినిమా పరిశ్రమలో వెలుగొందిన వారే.ప్రస్తుతం ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్నారు.