బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో తో పాటు మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం కూడా ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే ఇది వరకు ఈ కార్యక్రమం స్టార్ మా లో ప్రసారం కాగా ఈ కార్యక్రమానికి నాగార్జున మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ప్రస్తుతం జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ గా “ఎవరు మీలో కోటీశ్వరులు” పేరుతో ప్రసారమౌతున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఎన్టీఆర్ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా బుల్లితెరపై తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు.
తాజాగా ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఆగస్టు 22వ తేదీన ప్రసారమైన ఈ కార్యక్రమం ప్రీమియర్ ఎపిసోడ్ లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖ్య అతిథిగా వచ్చారు.ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుంచి భారీస్థాయిలో స్పందన లభించి ఏకంగా 11.40 టిఆర్పి రేటింగ్స్ ను సొంతం చేసుకుంది.ఈ క్రమంలోనే తర్వాత వారం ప్రసారమైన ఎపిసోడ్ లకు 5.62 రేటింగ్స్ కైవసం చేసుకుంది.
రెండవ వారంలో ఈ కార్యక్రమం రేటింగ్స్ విషయంలో దుమ్ములేపుతున్నట్టు తెలుస్తోంది.ఈ కార్యక్రమానికి రెండవ వారంలో ఏకంగా 6.48గా టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.రానున్న రోజుల్లో కూడా ఈ స్థాయిలో రేటింగ్స్ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
స్టార్ మా లో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రసారం అవుతున్నప్పటికీ జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం ఈ స్థాయిలో రేటింగ్స్ దక్కించుకోవడం విశేషం అని చెప్పవచ్చు.