అతడు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ?

అతడుమాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా.ఈ సినిమాను చూసిన వాళ్లు ఎవరూ అంత త్వరగా మార్చిపోలేరు.

అంతలా జనాల మనసుల్లోకి చేరిపోయింది.టీవీలో ఎన్నిసార్లు ప్రసారం అయినా మంచి రేటింట్స్ తో దూసుకుపోతుంది.

ఇప్పటికీ ఈ సినిమా అంటే పడిచచ్చే అభిమానులున్నారు.ఈ సినిమాలోని ప్రతి సీన్.

ప్రతి డైలాగ్ వారెవ్వా అనిపిస్తుంది.సినిమాకు సంబంధించిన పలు డైలాగ్స్ సోషల్ మీడియాలో మీమ్స్ గా దర్శనం ఇస్తూనే ఉన్నాయి.

Advertisement

మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమా విజయం కీలక పాత్ర పోషించింది అని చెప్పుకోవచ్చు.జనాలను ఈ సినిమా పాటలు ఓ రేంజిలో ఆకట్టుకున్నాయి.

అటు ఈ సినిమాలో బ్రహ్మానందం కొడుకు క్యారెక్టర్ చేసిన అబ్బాయి మనకు ఇప్పటికీ గుర్తుంటాడు.ఆ అబ్బాయి నాన్నా నాకోసం ట్రైన్ తెచ్చావా? అని అడగ్గానే హా తెచ్చాను రా రైల్వే స్టేషన్ లో ఉంది వెళ్లి తెచ్చుకోపో.అనే డైలాగ్ పటాస్ లా పేలింది.

ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటో తెలుసా? దీపక్ సరోజ్.ఈ కుర్రాడు అతడు తర్వాత పలు సినిమాలు చేశాడు.

ఆర్య, లెజెండ్, పెద్దబాబు, ఆంధ్రుడు, భద్ర సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

మిణుగురులు అనే అద్భుత సినిమాలో కీరోల్ ప్లే చేశాడు.ఆ తర్వాత వందనం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.తాజాగా ఈ కుర్రాడికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

బుల్లి తెరపై సంచలనం కలిగిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్.ఇప్పటి వరకు 4 సీజన్లు కంప్లీట్ అయ్యాయి.ఐదో సీజన్ కు రెడీ అవుతుంది.

ఇందులో దీపక్ కంటెస్టెంట్ గా పాల్గొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం ఈ సీజన్ లో పాల్గొనే వారంతా ఇప్పటికే క్వారంటైన్ లో ఉన్నారు.

వీరిలో దీపక్ ఉన్నాడా? లేడా? అనేది త్వరలో తేలిపోనుంది.

తాజా వార్తలు