టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత సంవత్సరం వచ్చిన అల వైకుంఠపురములో సినిమా తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని రికార్డ్ కలెక్షన్స్ కూడా అందుకున్నాడు.ఆ సినిమా తర్వాత అదే జోష్ లో లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పుష్ప సినిమా ను చేస్తున్నాడు.
ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు.
ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.
ఈ మధ్యనే పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇందులో పుష్ప రాజ్ గా తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ ఖర్చుతో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనీ అనుకుంటున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.ఇప్పటికే మొదటి పార్ట్ షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తి చేసుకుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.పరిస్థితులు చక్కబడితే కానీ ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభం అయ్యేలా లేదు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాపై ఒక రూమర్ బయటకు వచ్చింది.
ఈ సినిమా టైటిల్ ను సుకుమార్ చేంజ్ చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.మొదటి భాగం మాత్రం పుష్ప పేరుతొ విడుదల చేయబోతున్నాడట.రెండవ పార్ట్ లో టైటిల్ చేంజ్ చేసే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్టు టాక్.
మరి చూడాలి సుకుమార్ ఈ సినిమాను రెండు టైటిల్స్ తో విడుదల చేస్తాడో లేదో.ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను దసరా టైం కు తీసుకువచ్చే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తుంది.