టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పోకిరి మూవీతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయిన నటి ఇలియానా.ఈ అమ్మడు తెలుగులో వరుసగా స్టార్ హీరోలకి జోడీగా కమర్షియల్ సినిమాలలో నటిస్తూ హిట్స్ మీద హిట్స్ కొట్టింది.
అప్పట్లో టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ కూడా తీసుకునే నటిగా తన హవాని కొనసాగించింది.ఇలా తెలుగులో జులాయి సినిమా తర్వాత సౌత్ సినిమాలకి రెస్ట్ ఇచ్చి బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.
బార్ఫీతో హిందీలోకి అడుగుపెట్టి విభిన్న పాత్రలో మెప్పించింది.ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కూడా నటించడంతో ఆమెకి వచ్చిన స్థాయిలో గుర్తింపు ఇలియానాకి రాలేదు.
తరువాత అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ కి జోడీగా ఇలియానా నటించిన స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది.ఏదో అప్పుడప్పుడు అలా ఏడాదికి ఒకటి, అర సినిమాలతో ఇలియానా బాలీవుడ్ లో ప్రయాణం సాగిస్తుంది.
అయితే తెలుగు సినిమాలు వదిలేయడంతో టాలీవుడ్ ప్రేక్షకులు ఇలియానాని పూర్తిగా మరిచిపోయారు.
మళ్ళీ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఎవ్వరూ పట్టించుకోలేదు.సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్ లతో సందడి చేసిన మీడియా, సినిమా ప్రేక్షకులు మాత్రం ఈ బ్యూటీని పెద్దగా పట్టించుకోరు.దీనిపై తాజాగా ఆమె ఆసక్తికర వాఖ్యలు చేసింది.
ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా క్రూరమైనది.ఇక్కడ జీవించడం చాలా కష్టం.
ప్రజలు చూసేంతవరకే మేం స్టార్లుగా ఉంటాం.ఒక్కసారి వాళ్లు మమ్మల్ని పట్టించుకోవడం మానేస్తే ఆ స్టార్ స్టేటస్ అమాంతం కోల్పోతాము.
నా విషయంలో అదే జరిగింది అంటూ ఇలియానా చెప్పుకొచ్చింది.చిత్ర పరిశ్రమ గురించి చెప్పడానికి ఎన్నో చెడ్డ విషయాలు ఉన్నాయని, అయితే డబ్బు సంపాదించడానికి మాత్రం సినిమాకి మించిన మరో గొప్ప అవకాశం లేదని క్లారిటీ ఇచ్చింది.
మా అభిరుచికి అనుగుణంగా పరిశ్రమలో ప్రతీదీ జరగాలనేమీ ఉండదని, మన ప్రమేయం లేకుండానే చాలా విషయాలు జరిగిపోతాయని వాటిని నిలబడే ప్రయత్నం చేయాలని పేర్కొంది.ప్రజల ఫోకస్ బట్టి ఇక్క సెలబ్రిటీలకి అవకాశాలు ఉంటాయి తప్ప గొప్ప నటి, కష్టపడుతుందని ఎవరూ గుర్తించరని ఇలియానా చెప్పుకొచ్చింది.