ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాలు న్యాయస్థానాలలో అట్టర్ ఫ్లాప్ అవుతున్న సంగతి తెలిసిందే.వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలు న్యాయస్థానాలలో వీగిపోయాయి.
ఇటీవలే ఇంటర్ పరీక్షల విషయంలో కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.పరిస్థితి ఇలా ఉండగా నేడు ఏపీ హైకోర్టులో మూడు కీలక కేసులు విచారణకు రానున్నాయి.
రాజధాని పై దాఖలైన పిటిషన్ అదేవిధంగా సంగం డైరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం.జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి.పిటిషన్ లపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.ఈ మూడు కీలక కేసులు న్యాయస్థానం విచారణ చేపట్టిన నేపథ్యంలో.
ఏపీ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి.మరోపక్క ఈ మూడు కేసుల ని అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.
మరి న్యాయస్థానం ఏ విధమైన తీర్పు ఇస్తుందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.
.