సెలబ్రిటీలు తమ ముఖారవిందం పెంచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవడంతో పాటు బ్యూటీ కాస్మోటిక్స్ ని విపరీతంగా వాడుతూ ఉంటారు.మార్కెట్ లోకి ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చిన దాని గురించి తెలుసుకొని ఆ కాస్మోటిక్స్ తో తమ అందాన్ని మరింత పెంచుకోవడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు.
అయితే హీరోయిన్స్ గా ఉన్నప్పుడు ముఖారవిందం చాలా ముఖ్యమే అయినా కొంత మంది తారలు మాత్రం అందాన్ని పెంచుకోవడానికి చేసే పనులు ఒక్కోసారి వికటించి అందవికారంగా తయారవడం, లేదంటే ప్రాణాలు కూడా పోవడం జరుగుతుంది.ఇలాంటి సంఘటనలు చాలా సందర్భాలలో జరిగాయి.
తాజాగా కోలీవుడ్ బ్యూటీ రైజా విల్ సన్ ఫేషియల్ కోసం డెర్మటాలజిస్ట్ దగ్గరకి వెళ్తే, ఆమె అదే అవకాశంగా భావించి హీరోయిన్ పై కొత్త క్రీమ్ ని ప్రయోగించింది.అయితే ఆ ఫేషియల్ క్రీమ్ కాస్తా వికటించి.
దీంతో అందంగా ఉన్న హీరోయిన్ ముఖం వికారంగా తయారైన విషయం తెలిసిందే.కళ్ళకింద వాపు వచ్చేసి నల్లగా కమిలిపోయినట్లు అయిపొయింది.తనను కళావిహీనంగా మార్చిన ఆ డాక్టర్ ను సంప్రదించేందుకు వెళ్తే ఆమెను కలవనీయలేదని కూడా చెప్పింది.ఈ విషయమై తమిళనాడు మెడికల్ కౌన్సిల్ తోపాటు నేషనల్ మెడికల్ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
ఆ డాక్టర్ పని వల్ల తన ముఖం మొత్తం పాడైపోయిందని తాను మరికొన్నాళ్లపాటు సినిమాల్లో నటించే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేసింది.అంతేకాకుండా.మానసికంగా కూడా తీవ్ర వేదనకు గురైనట్టు తెలిపింది.తనకు జరిగిన ఈ నష్టానికి డాక్టర్ భైరవి నుంచి కోటి రూపాయల పరిహారం ఇప్పించాలని రైజా విల్ సన్ కోరినట్టు సమాచారం.