తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో( CM Revanth Reddy ) సీపీఎం నేతల భేటీ ముగిసింది.

ఈ మేరకు సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో తమ్మినేని, జూలకంటి, చెరుపల్లి కీలక సమావేశం అయ్యారన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి సీపీఎం( CPM ) తప్పుకుందని తెలుస్తోంది.భువనగిరి ఎంపీ( Bhuvanagiri Parliament ) బరిలో సీపీఎం తమ అభ్యర్థిని బరిలో నిలిపింది.

అయితే సీపీఎం అభ్యర్థిని పోటీ నుంచి తప్పించాలని అధికార కాంగ్రెస్ రిక్వెస్ట్ చేసిందని తెలుస్తోంది.దీంతో తమ అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీపీఎం తెలిపింది.

కాగా కాంగ్రెస్( Congress ) రిక్వెస్ట్ ను సీపీఎం దాదాపు ఓకే చేసిందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే సాయంత్రం తమ నిర్ణయాన్ని సీపీఎం ప్రకటించనుందని సమాచారం.

Advertisement

అదేవిధంగా 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తామన్న సీపీఎం.బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ తో కలిసి నడుస్తామని తెలిపింది.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత
Advertisement

తాజా వార్తలు