1.భారత్ లో కరోనా
24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 17,135 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2.ఎన్.డి.ఏ అభ్యర్థికి మాయావతి మద్దతు
ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఎన్డీఏ అభ్యర్థిగా నిలిచిన జగదీప్ ధనకర్ (71) కు బహుజన్ సమాజ్వాది పార్టీ అధినేత్రి ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి మద్దతు ప్రకటించారు.
3.రేవంత్ రెడ్డి పై వెంకటరెడ్డి విమర్శలు
రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ అని, ఆయన కు వ్యక్తిత్వం లేదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
4.మహా ప్రస్థానంలో ముగిసిన ఉమామహేశ్వరి అంతిక్రియలు
టిడిపి వ్యవస్థాపకుడు , ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వర అంత్యక్రియలు మహాప్రస్థానంలో ఈరోజు ముగిసాయి.
5.పింగళి కుటుంబ సభ్యులను సన్మానించిన అమిత్ షా
మహోత్సవ్ లో భాగంగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘనంగా సన్మానించారు.
6.సెజ్ లో మళ్ళీ విష వాయువు కలకలం
కపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో మరోసారి విష వాయువు లీక్ అయ్యింది. సీడ్స్ దుస్తుల ఫ్యాక్టరీలో రసాయన వాయువు లీకేజీ కారణంగా దాదాపు 50 మంది మహిళ ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు.
7.ట్రై కలర్స్ కంపెనీపై ఐటి దాడులు
కలర్స్ కంపెనీ పై ఐటి దాడులు నిర్వహించింది దేశవ్యాప్తంగా 16 చోట్ల స్వాధీలు ఐటి నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
8.ఢిల్లీకి బిజెపి ముఖ్య నేతలు
నేడు ఢిల్లీకి బిజెపి ముఖ్య నేతలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, మరికొంతమంది వెళ్ళనున్నారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరి కొంతమంది అగ్ర నేతలను కలవనున్నారు.
9.ఇగ్నో గడువు పెంపు
ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక యూనివర్సిటీ (ఇగ్నొ) డిగ్రీ పేజీ చీటీ డిప్లమో పీజీ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు తెలిపింది.
10.తెలంగాణలో కరోనా
గడిచిన 24 గంటలు తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 1054 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
11.నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో ఈడి సోదాలు
సెంట్రింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మంగళవారం ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించింది.
12.జాతీయ జెండా మన గౌరవం : గవర్నర్
జాతీయ జెండా మన గౌరవమని గవర్నర్ సౌందర రాజన్ అన్నారు.
13.జగన్ తో నాకు పరిచయమే లేదు : చికోటి ప్రవీణ్
ఏపీ సీఎం జగన్ తో తనకు పరిచయమే లేదని , తన పేరు తో కొందరు నకిలీ ట్విట్టర్ ఖాతాలు తెరిచారని క్యాసినో నిర్వాహకుడు చికొటి ప్రవీణ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
14.ఈటెల రాజేందర్ ఆగ్రహం
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శలు చేశారు.ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
15.ధరలపై కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టాలి : వైసీపీ ఎంపీలు
పెరిగిన ధరలపై కేంద్రం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.
16.తెలుగు వర్సిటీ గడువు పెంపు
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పీజీ యూజీపిజి డిప్లమో సర్టిఫికెట్ కోర్సులు వద్యార్థుల ప్రవేశానికి దరఖాస్తుల గడువును 22వ తేదీ వరకు పొడిగించారు.
17.కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలనే డిమాండ్ తో ఈనెల తొమ్మిదో తేదీన చేపట్టనున్న చలో ఢిల్లీ మహా ధర్నా కు రావాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
18.5న హైకోర్టుకు సెలవు
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈనెల 5వ తేదీన తెలంగాణ హైకోర్టుకు సెలవు ప్రకటించారు.
19.కేఏ పాల్ కామెంట్స్
తాను తెలంగాణ సీఎం కాబోతోంది నేనే అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ చెప్పారు.
20.రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,150 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,440
.