ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కు( MLA Amanatullah Khan ) ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.ఈ మేరకు ఢిల్లీ వక్ఫ్ బోర్డ్( Delhi Waqf Board ) అక్రమాల కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.ఈ నేపథ్యంలో రూ.15 వేల పూచీకత్తుపై ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.అయితే ఇటీవలే ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అక్రమాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
2018 నుంచి 2022 మధ్య వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా ఉన్న అమానతుల్లా బోర్డులోని సిబ్బంది నియామకాల్లో అక్రమాలు చేశారని ఈడీ ( ED ) ఆరోపిస్తుంది.తన అనుచరుల పేరి ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఎమ్మెల్యే డబ్బును పెట్టుబడిగా పెట్టారని ఈడీ పేర్కొంది.మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు తనను కావాలనే ఇబ్బంది పెడుతున్నాయని ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆరోపించారు.