కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావుపై( Minister Jupalli Krishna Rao ) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.ఈ మేరకు మంత్రి జూపల్లిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు( BRS Leaders ) కంప్లైంట్ చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచినా తనకు ఓట్లు వేయలేదని బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లిపై ఈసీ( EC ) చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
కాగా ఇటీవల కొల్లాపూర్ లోని పెంట్లవెల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు.ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని చోట్ల కంటే పెంట్లవెల్లిలోనే ఎక్కువగా ఖర్చు పెట్టాం.
ఇక్కడ పెట్టిన ఖర్చు ఎక్కడా పెట్టలేదు.అయినా ఓట్లు ఎందుకు రాలేదని కార్యకర్తలను ప్రశ్నించిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
దీంతో మంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.