కాంగ్రెస్ మంత్రి జూపల్లిపై ఈసీకి ఫిర్యాదు

కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావుపై( Minister Jupalli Krishna Rao ) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.ఈ మేరకు మంత్రి జూపల్లిపై బీఆర్ఎస్ పార్టీ నేతలు( BRS Leaders ) కంప్లైంట్ చేశారు.

 Complaint To Ec Against Congress Minister Jupalli Details, Jupalli Krishna Rao,-TeluguStop.com

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచినా తనకు ఓట్లు వేయలేదని బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లిపై ఈసీ( EC ) చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

కాగా ఇటీవల కొల్లాపూర్ లోని పెంట్లవెల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు.ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని చోట్ల కంటే పెంట్లవెల్లిలోనే ఎక్కువగా ఖర్చు పెట్టాం.

ఇక్కడ పెట్టిన ఖర్చు ఎక్కడా పెట్టలేదు.అయినా ఓట్లు ఎందుకు రాలేదని కార్యకర్తలను ప్రశ్నించిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

దీంతో మంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube