బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో సోనమ్ కపూర్( Sonam Kapoor ) ఒకరు.తాజాగా సోనమ్ కపూర్ తనకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బరువు పెరగడం( Weight Gain ) వల్ల తాను బాధ పడటంతో పాటు ఇబ్బందులు పడ్డానని ఆమె తెలిపారు.గర్భం దాల్చిన తర్వాత 32 కిలోల బరువు పెరిగానని సోనమ్ కపూర్ వెల్లడించారు.
ప్రసవం తర్వాత కూడా నేను అలానే ఉన్నానని ఆమె తెలిపారు.
ఆ సమయంలో కొంచెం బాధ పడ్డానని సోనమ్ కపూర్ పేర్కొన్నారు.
నేను బిడ్డను చూసుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చి బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టలేదని సోనమ్ కపూర్ వెల్లడించారు.నేను సరైన ఆహారం గురించి కూడా పట్టించుకోలేదని ఆమె అన్నారు.18 నెలల తర్వాత నేను శరీరాకృతిపై దృష్టి పెట్టడం జరిగిందని సోనమ్ కపూర్ వెల్లడించారు.ఇప్పటివరకు నేను 20 కిలోల బరువు తగ్గానని మరో 6 కిలోల బరువు తగ్గాలని ఆమె పేర్కొన్నారు.
తల్లైన తర్వాత లైఫ్ లో ప్రతిదీ మారుతుందని సోనమ్ కపూర్ చెప్పుకొచ్చారు.కొత్త ప్రపంచం ఏర్పడుతుందని ఫ్యామిలీతో ఉండే బంధాల్లో మార్పు వస్తుందని ఆమె కామెంట్లు చేశారు.మనల్ని మనం మరిచిపోయి పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతామని సోనమ్ కపూర్ వెల్లడించారు.ఆ సమయంలో శరీరంపై పెద్దగా ధ్యాస ఉండదని ఆమె పేర్కొన్నారు.ఈ అనుభూతి చాలా అపురూపంగా ఉందని సోనమ్ వెల్లడించారు.
స్త్రీగా పుట్టడం అద్భుతమైన విషయం అని బరువు తగ్గడం కోసం నేను వర్కౌట్లు చేశానని సోనమ్ పేర్కొన్నారు.ఆహారం విషయంలో మార్పులు చేసి నెమ్మదిగా బరువు తగ్గానని ఆమె వెల్లడించారు.2018 సంవత్సరంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సోనమ్ 2022 సంవత్సరంలో పండంటి మగబిడ్డకు( Baby Boy ) జన్మనిచ్చారు.సోనమ్ కపూర్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.