తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి.ఈ మేరకు మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కానున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

టెంపరేచర్( Temperature ) పెరగడంతో పాటు వడగాల్పుల తీవ్రత అధికం అవుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.తెలంగాణలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయన్న అధికారులు అటు ఏపీలో వడగాల్పులు) AP Heat Wave _ తీవ్రత పెరుగుతుందని వెల్లడించారు.

ఈ క్రమంలోనే తెలంగాణ( Telangana )లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.దీంతో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిన కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ మరియు జగిత్యాల జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి.ఈ క్రమంలో ప్రజలకు బయటకు రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు.

Advertisement

అలాగే అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత
Advertisement

తాజా వార్తలు