కాకినాడ జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.జనసేన అధినేత పవన్( Pawan Kalyan) పై తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన పవన్ కబుర్లు చెప్తున్నారని విమర్శించారు.
వంగా గీత( Vanga Geetha) కాపు కాదా అని ప్రశ్నించిన పవన్ కల్యాణే కాపునా అని ముద్రగడ ప్రశ్నించారు.పవన్ కచ్చితమైన కాపు అయితే తన చరిత్ర బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
తాను ఖచ్చితమైన కాపునన్న ఆయన కల్తీ కాపుల గురించి ప్రజలకు తెలియాలని చెప్పారు.దుష్టుల వల్ల తన కూతురు, తాను దూరమయ్యామని తెలిపారు.