షర్మిలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్.. ?

వైయస్ జగన్ చెల్లెలు, రాజన్న ముద్దు బిడ్డ అయిన వైఎస్ షర్మిల తెలంగాణలో నూతనంగా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక ఉన్న పార్టీలే కారు స్పీడ్‌కు కానరాక పోతుంటే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి ఏం చేస్తావు షర్మిల గారు అంటూ గులాభి నేతలు తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి విదితమే.

అయినా ఎవరు ఎంతలా భయపెట్టినా, భ్రమ పెట్టినా, తీవ్రమైన ఆరోపణలు చేసినా వైఎస్ షర్మిల మాత్రం వెనకడుగు వేయలేదు.సరికదా.

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ పలు జిల్లాలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు చేపట్టింది.తన ప్రసంగాల్లో నిరుద్యోగుల తరుపున పోరాడుతానని, వైఎస్సార్ ఆశయ సాధనకు కృషిచేస్తానంటూ హమీలు ఇచ్చింది.

అంతే కాకుండా ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసింది.మరి తెలంగాణ బాస్ ఊరుకుంటారా మనస్సు చివుక్కుమన్నట్లు ఉంది మరి దీని ఫలితం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం షర్మిలకు 15 రోజుల క్రితం కేటాయించిన 2ప్లస్2 గన్‌మెన్లను ఉపసంహరిస్తున్నట్లు వార్త తెగ ప్రచారం అవుతుంది.

Advertisement

మరి కేసీయార్ మజాకా నోరును అదుపులో ఉంచుకోకపోతే తెలంగాణలో ఇలాంటి షాకులే తగులుతాయని అనుకుంటున్నారట కొందరు.

పవన్ కళ్యాణ్ కి మద్దతుగా రామ్ చరణ్..!!
Advertisement

తాజా వార్తలు