ముఖంపై మచ్చలు మరియు మొటిమలు లేకుండా అందంగా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు.కానీ, మన చర్మం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది.
ఎప్పుడు ఏదో ఒక చర్మం సమస్య ఇబ్బంది పెడుతుంది.దీంతో ఆ సమస్యలను తగ్గించుకునేందుకు నానా ఇబ్బందులు పడతారు.
ఏవేవో క్రీములు కోనుగోలు చేసి వాడుతుంటారు.కానీ, ఎప్పుడూ కొన్ని కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అయితే.
ఎలాంటి చర్మ సమస్య దరిచేరకుండా ఉంటుంది.ముఖ్యంగా ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉంటే వేప ఆరోగ్య పరంగానే కాకుండా.
సౌందర్య పరంగానూ ఎంతో మేలు చేస్తుంది.
అలాంటి వేపలో మనకు అందుబాటులోనే ఉండే కొన్నిటిని కలిపి ఎప్పటికప్పుడు యూజ్ చేస్తూ ఉంటే.
మొటిమలు, మచ్చలు, ముడతలు ఇలా ఎన్నో చర్మ సమస్యలకు దూరంగా ఉండొవచ్చు.ఇక ఇందులో మొదటిది వేప-బొప్పాయి.ముందుగా వేప ఆకులను ఎండిబెట్టి పొడి చేసుకోవాలి.ఆ తర్వాత బాగా పండిన బొప్పాయి గుజ్జులో వేప పొడి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.
ఇరవై నిమిషాల పాటు ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల.
ముఖంపై ఎటువంటి మచ్చలుగాని, మొటిమలుగాని లేకుండా చేసి.అందంగా మెరిపిస్తుంది.
అలాగే రెండొవది.వేప మరియు తులసి.మందుగా వేప ఆకులు, తులసి ఆకులను విడి విడిగా ఎండబెట్టి పొడి చేసిపెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్లో వేప ఆకుల పొడి, తులసి ఆకుల పొడి, చిటికెడు పసుపు మరియు వాటర్ వేసి.
బాగా కలుపుకుని ముఖానికి పట్టించాలి.ఆరిన తర్వాత కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే.యవ్వనంగా, కాంతివంతంగా ముఖం ఉంటుంది.
ఇక కొందరు ముఖం ఎప్పుడూ జిడ్డు కారుతూ.అగ్లీగా కనిపిస్తుంది.అలాంటి వారు వేపాకుల నుంచి రసం తీసుకుని.ముఖానికి అప్లై చేయాలి.
పావుగంట లేదా ఇరవై నిమిషాల తర్వాత ఐస్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే.
ముఖం ఫ్రెష్గా మరియు ప్రకాశవంతంగా కనిపిస్తుంది.