ఎవరైనా పామును చూడగానే ఒకింత భయానికి గురవుతారు.అలాంటిది ఓ చిన్నారి 12 అడుగుల కొండచిలువను చూస్తే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి.
అవును ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రో జిల్లా అదంపూర్ థానా ఏరియాలో ఓ పాప తన ఇంటి పెరట్లో ఉన్న లేగదూడలను 12 అడుగుల కొండచిలువ అమాంతం మింగేయడానికి కళ్లారా చూసింది.
ఈ విషయాన్ని పొలంలో పని చేసుకుంటున్న తన తండ్రికి ఉరుకుతూ వెళ్లి తెలపగా… అక్కడ అతను అన్ని పనులను మానేసి ఊరి ప్రజలతో కలిసి తన ఇంటి వద్దకు చేరుకున్నారు.
వారు అక్కడికి చేరుకునే సమయంలో సదరు కొండచిలువ లేగదూడ ను పూర్తిగా పొట్టలోకి పంపించేసింది.నిజానికి అంత పెద్ద లేగదూడ ను కొండచిలువ మింగేసింది అంటే స్థానికులు ఎవరు నమ్మలేదు.
కాకపోతే ఆ అమ్మాయి కళ్లారా చూడడంతో పెద్దలు నోరు మెదపలేదు.
దీంతో అక్కడి ప్రజలకు ఏం చేయాలో అర్థం కాక.వెంటనే అటవీ అధికారులకు సమాచారాన్ని అందించారు గ్రామస్తులు.ఆ తర్వాత ఆ పాముకు హాని చేయకుండా, దాని బారిన మరింతమంది పడకుండా ఆ పాము చుట్టూ కొందరు ప్రజలు రక్షణ గా ఏర్పడి రక్షణగా ఉన్నారు.
అక్కడే ఉన్న స్థానిక పోలీసులే అక్కడ కొద్దిసేపు రక్షణ ఉన్నారు.ఇక ఆ తర్వాత వచ్చిన అటవీ అధికారులు పామును పరిశీలించడంతో అప్పటికే ఆ పాము చనిపోయిందని వారు నిర్ధారించారు.
అంతేకాదు పొట్ట లో ఉన్న ఆవు కూడా చనిపోయినట్లు అధికారులు నిర్ణయించారు.దీంతో గ్రామస్తులందరూ పోలీసుల సమక్షంలో ఊరి చివర ఓ పెద్ద గొయ్యి తీసి ఆ పామును అందులో పూడ్చి పెట్టారు.