ఒకప్పుడు టీమిండియాలో ఆల్ రౌండర్ మరియు పేరు మోసిన హిట్టర్ గా పేరు తెచ్చుకున్నటువంటి ఎడమ చేతి వాటం బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ అంటే అందరికీ ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటాడు.అంతేగాక యువరాజ్ సింగ్ అంటే అందరికీ ముందుగా ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు బాది నటువంటి సన్నివేశాలు గుర్తొస్తాయి.
అయితే ఒకప్పుడు వీరోచిత ఫామ్ తో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించినటువంటి యువరాజ్ సింగ్ నిలకడ లేని కారణంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.అయితే ఆ తరువాత లిమిటెడ్ ఓవర్ల లీగ్ లలో ఆడుతున్నాడు.
అయితే తాజాగా యువరాజ్ సింగ్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో కార్యక్రమం నిర్వహించారు.ఇందులో భాగంగా కొందరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.
అయితే ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి భారత క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తప్ప ఎవరూ రోల్ మోడల్స్ లేరని అభిప్రాయం తెలిపాడు.అంతేగాక ప్రస్తుత కాలంలో ఆటగాళ్ళు భారత జట్టుకి ఆడుతున్న సమయంలో తమ సొంత ప్రయోజనాల కోసం ఎక్కువగా చూసుకుంటున్నారని అంతేగాక సీనియర్లకి అప్పుడు ఉన్నటువంటి గౌరవం ఇప్పుడు లేదని చెప్పుకొచ్చాడు.
అయితే ప్రస్తుతం భారత్ జట్టులో కొనసాగుతున్న టువంటి ఆటగాళ్లను రిషబ్ పంత్ తో తరచూ మాట్లాడతానని అలాగే రిషబ్ పంత్ ఆట కోసం కఠోరంగా శ్రమించే స్వభావం కలవాడని కూడా తెలిపాడు.అంతేకాక అప్పట్లో తమ సీనియర్లను చూసి ఎన్నో విషయాలను నేర్చుకునే వాళ్ళని కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పుడున్న ఆటగాళ్లు టెక్నాలజీ మరియు సోషల్ మీడియాలో ఉపయోగించుకుంటూ సొంతంగా అనుభవాలను సంపాదిస్తున్నారని తెలిపారు.