శ్రీదేవి ఈ కారణంగానే మరణించిందా ?

తెలుగు హీరోయిన్ గా ప్రస్థానం ప్రారంభించి బాలీవుడ్ లో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల సుందరి శ్రీదేవి అకాలంగా మరణించడం దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఆమె దుబాయ్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా అక్కడ ఓ హోటల్ టబ్ బాత్ లో మరణించింది.

 Actor Sridevi Mistary-TeluguStop.com

అయితే ఆమె మరణం సహజంగా జరిగిందా ? లేక ఎవరైనా ఒక వ్యూహం ప్రకారం హత్యా చేశారా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.

అయితే ఆమె బయోగ్రఫీ రాసిన సత్యార్థ్‌ నాయక్‌ చెబుతున్న మాటల ప్రకారం రక్తపోటే ఆమె పాలిట మృత్యుపోటుగా మారింది అనే విషయాన్ని ఆయన బయటపెట్టారు.

శ్రీదేవి మొదటి నుంచి బీపీతో సతమతమయ్యేవారని ‘చాల్‌బాజ్‌’ దర్శకుడు పంకజ్‌ పరాషర్‌, నాగార్జున నాతో చెప్పారు అంటూ సత్యర్ద్ నాయక్ చెప్పారు.గతంలో ఆమె తమతో సినిమాల్లో నటించిన సమయంలో ఆమె బాత్‌రూమ్‌లో పడ్డారని వారు గుర్తు చేసుకున్నారని ఆయన చెప్పారు.

తర్వాత నేను శ్రీదేవి చెల్లెలు మహేశ్వరిని కలిశా.ఆమె కూడా శ్రీదేవి ఓసారి బాత్‌రూమ్‌లో పడి ఉండడం చూశానని చెప్పారు.మరోసారి వాకింగ్‌ చేస్తుండగా శ్రీదేవి కుప్పకూలిపోయిందని బోనీ కపూర్‌ నాతో చెప్పారు.నేను రాసినట్టు ఆమె రక్తపోటు వల్లే మరణించారు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube