నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం ‘రూలర్’ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.ఈ చిత్రంకు సంబంధించిన ప్రమోషన్ ఎక్కువగా చేయడం లేదు.
దాంతో సినిమాపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సినిమాను ఎక్కువగా ప్రేక్షకులు ఆధరిస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.
ఇలాంటి సమయంలో సినిమా ట్రైలర్ చూసిన తర్వాత బాలయ్య మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురుస్తుంది.
బాలకృష్ణ మరియు కేఎస్ రవికుమార్ల దర్శకత్వంలో రూపొందిన జైసింహా చిత్రం దారుణమైన పరాజయం పాలయ్యింది.ఆ సినిమా నిర్మాతకు షాక్ ఇచ్చింది.ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబో అంటే జనాలు అస్సలు ఆసక్తి చూపడం లేదు.
రూలర్ చిత్రంను భారీ ఎత్తున తెరకెక్కించారు.కేవలం మూడు నెలల్లో అయినా కూడా ఎక్కువ ఖర్చు చేసి మరీ చిత్రీకరించారు.
జైసింహా ఫ్లాప్కు బదులు అన్నట్లుగా ఈ సినిమాను దర్శకుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించాడు.
ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా సోనాల్ చౌహాన్ మరియు వేదికలు హీరోయిన్స్గా నటించారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు.కాని ఈ ప్రమోషన్ సరిపోవడం లేదని, ఇంకాస్త జోరు పెంచాలని అంటున్నారు.
మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తేలిపోబోతుంది.