సోషల్ మీడియాను ప్రస్తుతం యువత మరీ దారుణంగా వాడేస్తున్నారు.ఒకప్పుడు యువత తాగడం, తిరగడం, డ్రగ్స్ తీసుకోవడం వల్ల చెడిపోయేవారు.
కాని ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చెడిపోతున్నారు.సోషల్ మీడియా కారణంగా కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోవడం, సర్వం కోల్పోవడం ఇంకా పలు రకాలుగా ఇబ్బందులు పడటం మనం చూస్తూనే ఉన్నాం.
తాజాగా ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం సోషల్ మీడియా సమాజాన్ని నాశనం చేసిందనేందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.రవి నారంగ్ అనే వ్యక్తి ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు.తన అకౌంట్ పేరును కూడా మార్చి పెట్టాడు.
ఇక ప్రొఫైల్ పిక్చర్ కూడా మార్చి పెట్టడం జరిగింది.బాగా డబ్బున్న వ్యక్తిగా సోషల్ మీడియాలో తనకు తాను డబ్బాలు కొట్టుకోవడం మొదలు పెట్టాడు.
అతడు అందమైన అమ్మాయిల వేట మొదలు పెట్టాడు.కొంత మంది అమ్మాయిలను సెలక్ట్ చేసుకుని వారితో ఛాటింగ్ మొదలు పెట్టాడు.
అందులో ఒక్కరు ఇద్దరు అతడికి బాగానే కనెక్ట్ అయ్యారు.ఒక అమ్మాయితో వ్యవహారం చాలా దూరం వరకు వెళ్లింది.
ఇద్దరు కూడా సోషల్ మీడియా ద్వారా గంటలు గంటలు ఛాటింగ్ చేసుకునే వారు.
చివరకు ఇద్దరు కూడా కలవాలని నిర్ణయించుకున్నారు.ఇద్దరు ఒక ప్రదేశం అనుకున్నారు.అక్కడకు అతడు తన స్నేహితులతో వెళ్లాడు, ఆమె కూడా తన స్నేహితురాలితో వచ్చింది.
అక్కడ ఒకరిని ఒకరు చూసుకుని సిగ్గుతో చచ్చి పోయారు.ఆ అమ్మాయి కన్నీరు కార్చుకుంటూ అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్లింది.
అసలు విషయం ఏంటీ అంటే ఇన్నాళ్లు సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుంది సొంత అన్నా చెల్లెలు.ఆమె కూడా తోడు కోసం సరదా కోసం ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అబ్బాయిలతో ఆడుకోవాలని భావించి సొంత అన్న వలలోనే పడింది.
ఈ విషయం స్నేహితుల ద్వారా బయటకు పొక్కింది.ఇలాంటి ఛెండాలమైన సంఘటనలు మరెన్ని ముందు ముందు చూడాల్సి ఉంటుందో.!
.