పసిపిల్లలకు తల్లిపాలే ఆహారం, అమృతం.అయితే దాన్ని చెడు అలవాట్లతో విషంగా మార్చకూడదని మనందరికి తెలిసిందే.
సిగరెట్లు, మద్యం .ఇలాంటి అలవాట్లు మానెయ్యాలని కొత్తగా చెప్పనక్కరలేదు.అయితే చాలామంది ఊహించని విధంగా కొన్ని ఆహారపదార్థాలు పాలుపట్టే తల్లులు తీసుకోకపోవడమే మంచిది.అవేటంటే ….
* సిట్రస్ ఫలాలు పాలు పట్టే తల్లులు తీసుకోకపోతే మేలు.ఎందుకంటే పిల్లల GI అప్పటికి ఇంకా ఎదిగి ఉండదు.
నారింజ లాంటి సిట్రస్ ఫలాలలో ఉండే కొన్ని లక్షణాలు ఈ కారణంగా పిల్లలకి చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి.అలా అనిపిస్తే ఇంకేముంది .వెంటనే ఏడుపందుకుంటారు.
* పాలు పడుతున్న తల్లి కాఫీ కూడా తాగకూడదు.
ఎందుకంటే కెఫైన్ ని తల్లి శరీరం బాగానే తీసుకుంటుంది కాని, పసివారి శరీరం ఇంకా కెఫైన్ ని తీసుకునేందుకు సిద్ధంగా ఉండదు.
* చాకొలెట్లు కూడా పసిపిల్లలకి సరిగా పడవని పరిశోధనలు చెబుతున్నాయి.
తల్లి చాకోలేట్ తిన్నాక పాలిస్తే, ఆ తరువాత బిడ్డ ఏడ్చినా, మలవిసర్జన చేసినా, చాకొలెట్లు తినడం ఆపేయ్యాల్సిందే.
* అన్నిరకాల చేపలు పిల్లలకి మంచివి కావు.
కాబట్టి ఎలాంటి సీ ఫుడ్ తీసుకోవాలో డాక్టర్ ని అడగాలి.
* పాలు పట్టే సమయంలో పార్స్లీ తినటం కూడా మంచిది కాదు.
ఇది పాల విడుదలని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.అంటే తల్లి ఇచ్చే పాలు బిడ్టకి సరిపోకపోవచ్చు.