మిస్టర్ కూల్గా పేరొందిన మోస్ట్ సక్సెస్ఫుల్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ( MS Dhoni ) హీరో లాగా హ్యాండ్సమ్ గానూ ఉంటాడు.అందుకే అతడికి అమ్మాయిల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.
అలాగే ఈ క్రికెటర్ని హీరోగా ఇంకా అవతారాల్లో చూడాలని చాలామంది తపన పడుతుంటారు.నిజానికి బ్యాక్ పట్టుకున్నా, నాయకత్వం చేపట్టినా ధోనీకి తిరుగు ఉండదు.
అందుకే ఒక్క ఇండియాలోనే మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ అద్భుతమైన క్రికెటర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత కూడా, అతను IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings )ను విజయపథంలో నడిపించాడు.41 ఏళ్ల వయసులో కూడా ఒంటి చేత్తో టైటిల్ నెగ్గి తన సత్తా ఏంటో చూపించాడు.అయితే తాజాగా ధోనీ సంబంధించిన కొన్ని మల్టీవర్స్ ఫొటోస్ వైరల్గా మారాయి.
ఈ పిక్స్లో ఈ క్రికెట్ విభిన్న వెర్షన్లలో అనిపించే అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
ఒక AI ఆర్టిస్ట్ ధోనీ మల్టీవర్స్ వెర్షన్లు క్రియేట్ చేశాడు.సదరు ఆర్టిస్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని( Artificial Intelligence ) వినియోగించి ధోనీని మల్టీ బిలియనీర్గా, భారతీయ ఆర్మీ సైనికుడిగా, గ్యాంగ్స్టర్గా, శాంతియుత సన్యాసిగా, మధ్యయుగ సైనికుడిగా, వ్యోమగామిగా, చెఫ్గా, బాక్సర్గా, కౌబాయ్గా, భయంకరమైన బార్బెరియన్గా కూడా క్రియేట్ చేసి చూపించాడు.ఈ అబ్బురపరిచే ఇమేజ్లను @wild.
trance పేజీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.కొంతసేపటికే ఈ పోస్ట్ వైరల్ అయింది.
ఫ్యాన్స్ ఈ కళాకారుడి క్రియేషన్ చూసి వావ్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.వీటిని మీరు కూడా చూసేయండి.