వైద్యులను ప్రజలు మరో దేవుని అవతారంలా చూస్తారు.ఎందుకంటే కొంత మంది వైద్యులు ప్రజలకు అలాంటి సేవ చేస్తున్నారు మరి.
ప్రమాదాలు జరిగి ఆసుపత్రులకు వచ్చిన వారికి కొంతమంది వైద్యులు ఎటువంటి డబ్బులు లేకుండా చికిత్సలు చేసి వారి ప్రాణాలను కాపాడుతూ ఉంటారు.కాబట్టి ప్రజలు వైద్యులను భూమిపై ఉన్న దేవుళ్ళుగా చూస్తారు.
ముఖ్యంగా మహిళ డాక్టర్లు గర్భవతులకు చేసే చికిత్స చాలా ముఖ్యమైనది.
ఎందుకంటే కాస్త అటు ఇటు అయినా తల్లికి, పుట్టబోయే బిడ్డకి కూడా ప్రమాదం జరగవచ్చు.
అందుకోసం చాలామంది మహిళా డాక్టర్లు ఎంతో జాగ్రత్తగా గర్భవతులకు చికిత్స చేస్తారు.తల్లికి గాని, బిడ్డకి గాని ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వైద్యులు కూడా ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
అలా ఒక పసిబిడ్డ పుట్టిన వెంటనే ఊపిరి తీసుకోకుండా ఉంటే ఒక వైద్యురాలు ఆ పసిబిడ్డకు ఊపిరి అందించి ప్రాణం పోసింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోను చూసినా నెటిజన్లు ఆ మహిళా వైద్యురాలు చేసిన పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ ఘటన ఆగ్రాలోని సి హెచ్ సి లో ఒక శిశువు జన్మించింది.
అయితే పుట్టినప్పుడు ఆ పసిబిడ్డలో ఎలాంటి కదలికలు లేవు.ఏడవ లేదని పసిబిడ్డకు ఆక్సిజన్ కూడా పెట్టారు.
అయినా కూడా ఆ పసిబిడ్డలో కదలిక రాకపోవడంతో వైద్యురాలు ఆ శిశువుకు ప్రాణం పోసింది.
అది ఎలా అంటే తన నోటి ద్వారా ఆ పసి బిడ్డకు శ్వాస నోటి ద్వారా అందించింది.
ఇలా శ్వాస అందించిన ఏడు నిమిషాల తర్వాత ఆ శిశువులో కదలిక వచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
ఆ పని చేసిన వైద్యురాలిపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.