విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం గాల్లో కలసిపోతున్నట్లుగా ఉంది.కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల ఈ విషయంలో ఏపీలో పెద్ద ఉద్యమమే సాగుతుంది.
ఇక పలు కార్మిక సంఘాలు కూడా విశాఖ ఉక్కు పైవేటీకరణను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కు గర్జన పేరుతో విశాఖలో కార్మికులు ఈరోజు సాయంత్రం భారీ సభను ఏర్పాటు చేసి, ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇదే సమయంలో స్టీల్ ప్లాంట్ కు చెందిన ఓ కార్మికుడు రాసిన సూసైడ్ నోట్ కలకలం సృష్టించింది.
విశాఖ ఉక్కును ఎట్టిపరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరించేందుకు ఒప్పుకోవద్దని, 32 మంది ప్రాణత్యాగం వలన ఉక్కు పరిశ్రమ వచ్చిందన్న విషయం గుర్తుంచుకోవాలని, తన ప్రాణత్యాగంతో ఉక్కు గర్జన ప్రారంభం కావాలని, ఐక్యత పెరగాలని, అందువల్ల ఈ రోజు సాయంత్రం 5:49 గంటలకు ఉక్కు గర్జన ప్రారంభం అయ్యేలోగా ప్రాణత్యాగం చేస్తానని సూసైడ్ నోట్ లో ఆ అజ్ఞాత వ్యక్తి పేర్కొన్నారు.కానీ సూసైడ్ నోట్ రాసి పెట్టిన వ్యక్తి మాత్రం ఎవరన్ని విషయం తెలియరాలేదట.కాగా ఆ వ్యక్తి కోసం పోలీసులు, కార్మికులు గాలిస్తున్నారట.