దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 12 వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుల మధ్య చోటు చేసుకున్న వ్యవహారాలు పెద్ద సంచలనంగా మారాయి.కుటుంబ సభ్యులంతా విడివిడిగా ఎవరికి వారు వైఎస్ కు నివాళులర్పించే కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులు అర్పించారు.వైఎస్ జగన్, విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిల, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలంగాణ కు చెందిన కొంతమంది నేతలు, వైఎస్ కు అత్యంత సన్నిహితులైన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం రోజు అయినా షర్మిల జగన్ మాట్లాడుకుంటారని అంతా అంచనా వేసినా, ఎవరికీ వారే అన్నట్లుగా దూరంగానే ఉంటూ ఈ కార్యక్రమాన్ని ముగించారు.దీంతో వైఎస్ కుటుంబంలో తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయనే అంశం మరోసారి చర్చకు వచ్చింద.
ఈ రోజు వైఎస్ విజయమ్మ వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులైన వారితో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెట్టిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం పై అనేక అనుమానాలు ఉన్నాయి.
అది కాకుండా షర్మిల పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి జగన్ ఆమెకు దూరంగా ఉండడం, ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం, రాఖీ పండుగ రోజు అయినా జగన్ షర్మిల మధ్య భేటీ ఉంటుందని అందరూ అంచనా వేసినా, దూరంగానే ఉన్నారు.ఇదిలా ఉంటే తాజాగా వైస్ షర్మిల ట్విట్టర్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
ఆ పోస్ట్ లో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ షర్మిల పోస్ట్ పెట్టారు.
ఒంటరి దానినైనా, విజయం సాధించాలని.అవమానాలు ఎదురైనా ఎదురీదాలి అని, కష్టాలు ఎన్ని అయినా ధైర్యంగా ఎదుర్కోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటి పాపలో చూసుకున్నారు.నాకు బాధ వస్తే మీ కంటి నుంచి నీరు కారేది.ఈ రోజు నా కన్నీరు ఆగనంటోంది. I Love & MISS U DAD అంటూ షర్మిల తన ఆవేదనని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు.
ఈ ట్వీట్ ను షర్మిల పెట్టడం వెనుక రకరకాల కారణాలను ఇప్పుడు ప్రచారంలోకి వస్తున్నాయి రాజశేఖర్రెడ్డి తలుచుకుని ఆమె ఈ రకంగా పోస్ట్ పెట్టారని చర్చ జరుగుతుండగా తాను పార్టీ పెట్టడం జగన్ కు ఇష్టం లేదని, తన అన్న జగన్ అప్పటి నుంచి దూరంగానే ఉంటున్నారు అనే అవేదనతోనే షర్మిల ఈ ఈ రకంగా స్పందించారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.