మధ్యప్రదేశ్ మొరేనా( Morena ) జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.ఒక యువకుడు తన స్నేహితులతో కలిసి తన మాజీ మ్యాథ్స్ టీచర్ పై కర్రతో దాడి చేశాడు.
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
CCTV ఫుటేజ్లో, ముసుగులు ధరించిన యువకుడు, అతడి స్నేహితులు ఒక కోచింగ్ క్లాస్లోకి చొరబడి, లోపల ఉన్న గణిత ఉపాధ్యాయుడిపై కర్రతో దాడి చేస్తారు.
ఈ దాడి భయంతో విద్యార్థులు పరుగులు తీశారు.వీడియోలో, ఉపాధ్యాయుడు దాడి చేసిన వ్యక్తులతో పోరాడుతున్నట్లు కనిపిస్తుంది.అయితే, తర్వాత వారు ఉపాధ్యాయుడిని బయటకు లాగి, అక్కడ అతనిపై మరింత దాడి చేశారు.
వివరాల్లోకి వెళితే, గణిత ఉపాధ్యాయుడు సందీప్ శుక్లా( Sandeep Shukla ) తన విద్యార్థులకు పాఠం చెబుతున్నప్పుడు, మాజీ విద్యార్థి ఆదిత్య( Aditya ), అతని స్నేహితులు క్లాస్లోకి చొరబడ్డారు.ఆదిత్య టీచర్ ని బయటకు లాగి, కర్రతో దాడి చేశాడు.ఉపాధ్యాయుడు కర్రతో దాడి చేయడానికి ప్రయత్నించగా, ఆదిత్య దానిని లాక్కుని ఎదురుదాడికి దిగాడు.
ముఖంపై గుద్దుతూ బీభత్సం సృష్టించాడు.టీచర్ గాయపడటంతో, చుట్టుపక్కల వారు జోక్యం చేసుకున్నారు.
దాడి చేసిన వ్యక్తులు పారిపోయారు.
ఆదిత్యను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కోచింగ్ క్లాస్ నుంచి బహిష్కరించారట.ఆ పగతో ఈ దాడి జరిగిందని తెలుస్తోంది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.బాధితుడైన ఉపాధ్యాయుడు శుక్లా పోలీసు స్టేషన్కు వెళ్లి దాడికి సంబంధించిన CCTV ఫుటేజ్ను అందించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.దాడి చేసిన విద్యార్థి ఆదిత్య గతంలో మరొక విద్యార్థిని కొట్టి ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
ఈ కారణంగా ఉపాధ్యాయుడు సందీప్ శుక్లా అతనిని కోచింగ్ సెంటర్ నుంచి బహిష్కరించాడు.అప్పటి నుంచి ఆదిత్య ఉపాధ్యాయుడిని బెదిరిస్తున్నాడు.