పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రంగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్.ఈ సినిమా ఈ నెల 25వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి తదితరులు పాల్గొన్నారు.ఇక ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఫ్రీ రిలీజ్ వేడుకలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ముందుగా ఈ సినిమా వేడుకకు వచ్చిన మంత్రులకు సినీ ప్రముఖులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఈ వేదికపై మాట్లాడుతూ….
నేను ప్రజాజీవితంలో ఉన్నప్పటికీ నాకు అన్నం పెట్టింది ఈ సినిమాలే.ఈ సినిమాలలో నటించడం వల్ల నాకు ఇంత మంది అభిమానులను భిక్షగా అందించింది అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ నేను సినిమాలలో లేకపోతే ప్రజాసేవలో కూడా ఉండేవాడిని కాదేమో అంటూ పవన్ వెల్లడించారు.
రాజకీయాలలో ఉన్నాను కదా అని ఎలా పడితే అలా సినిమాలు చేయలేదని తన కెరియర్ మొదట్లో ఖుషి,తొలిప్రేమ సినిమాలో ఎంత బాధ్యతగా చేశానో ఈ సినిమాని కూడా అంతే బాధ్యత నిబద్ధతతో చేశానని ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని సందడి చేస్తోందని రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా గురించి తెలియజేశారు.ఇక ఈ సినిమా కోసం టెక్నీషియన్లు అందరూ ఎంతో అద్భుతంగా పని చేశారని ఈ వేదికపై వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.