టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్.ఇందులో హీరో రానా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.ఇకపోతే భీమ్లా నాయక్ సినిమాలో పాటలకు ప్రేక్షకులకు భారీగా స్పందన లభించింది.
కానీ ట్రైలర్ చూసిన తర్వాత కాస్త నిరాశ చెందారు.ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా లేదని అంటున్నారు.అంతేకాకుండా ఈ విషయంపై ఇదేంటి థమన్ భయ్యా ఇలా చేశావు? అఖండ సినిమాకు అదిరిపోయే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చావు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే.
ట్రైలర్ ని చూసిన తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగాయి.టైలర్ లో పవన్ ను చూసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.ఇక నెటిజెన్స్ అడిగే ప్రశ్నలకు తమన్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు.
ఈ నేపథ్యంలోనే చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.థియేటర్ లో ర్యాంప్ అమ్మా.అన్నీ ట్రైలర్ లోనే ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా.అడవిలోని మంటకు.వీధుల్లో వచ్చే మంటకు తేడా ఉండాలి కదా?.కలుద్దాం అంటూ తమన్ ఓ ట్వీట్ వేసి అసలు విషయాన్ని చెప్పేశాడు.తమన్ చేసిన ట్వీట్ ని బట్టి చూస్తే అంటే థియేటర్ లో సంగీతం మోత మోగిపోద్దని పరోక్షంగా చెప్పేశాడు.
భీమ్లా నాయక్ సినిమా మాత్రం ఫిబ్రవరి 25న విడుదల కావడానికి రెడీ అయింది.ఇప్పటికే అన్ని చోట్లా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.