తెలుగు బిగ్బాస్ సీజన్ 4 అప్పుడే రెండు వారాలు పూర్తి చేసుకుంది.ఇప్పటి వరకు కూడా ఇంటి సభ్యులు చాలా సేఫ్ గేమ్ ఆడుతూ వస్తున్నారు.
ఇకపై ఆ సేఫ్ గేమ్స్ సాగవు అంటూ నాగార్జున శని ఆదివారాల ఎపిసోడ్స్ తో ఫుల్ క్లాస్ పీకాడు.గత వారం నామినేషన్ పక్రియ చాలా లైట్ తీసుకున్న ఇంటి సభ్యులకు నేటి నామినేషన్ పక్రియ ఎలా ఉంటుందా అంటూ చాలా ఆసక్తికరంగా ఉంది.
ఖచ్చితంగా నేటి నుండి ఇంటి సభ్యులు తమ మాస్క్ లను తీసేసి మరి ఆట ఆడే అవకాశం ఉంది.ఇప్పటి వరకు చూసిన షో వేరు ఇకపై చూడబోతున్న షో వేరు అంటూ చాలా మంది అనుకుంటున్నారు.
ప్రతి ఒక్కరు కూడా ఇకపై జెన్యూన్గా ఆడుతారని అంతా ఆశిస్తున్నారు.ఇప్పటి వరకు సేఫ్ గేమ్ ఆడుతూ సింపతీ కొట్టేయాలనుకుంటున్న వారు సింపతితో ఓట్లు రావంటూ నాగార్జున చెప్పడంతో ఇకపై సింపతీ కార్డ్ ను ప్రదర్శించే అవకాశం లేదని అనిపిస్తుంది.
ఈవారంలో టాస్క్లు మరియు నామినేషన్ పక్రియ మరీ దారుణంగా ఉంటుందని ఖచ్చితంగా ప్రేక్షకులు మరియు షో నిర్వాహకులు చెబుతున్నారు.బిగ్బాస్లో ఎంటర్టైన్మెంట్తో పాటు గొడవలు ఎంతగా ఉంటే అంతగా ఎక్కువ రేటింగ్ వస్తుంది.
తెలుగు బిగ్బాస్ సీజన్ 4కు రికార్డు స్తాయి రేటింగ్ వచ్చిందని అంటున్నారు.కనుక మరింతగా ఎక్కువ రేటింగ్ ను తెప్పించేలా మేకర్స్ గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మొన్నటి నుండి ఐపీఎల్ ప్రారంభం అయ్యింది.కనుక బిగ్బాస్ను ఎవరు చూస్తారు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాని అలాంటిది ఏమీ లేదు.ఖచ్చితంగా బిగ్బాస్ ను కూడా ప్రేక్షకులు ఆధరిస్తారనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా ఒక గంట బిగబాస్కు కేటాయించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.కనుక ఈ సీజన్ లో ఇకపై రచ్చ ఉంటూ మజా వస్తుందని అనిపిస్తుంది.