తెలుగులో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించినటువంటి కుమారి 21ఎఫ్ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ముద్దుగుమ్మ యాంకర్ భాను శ్రీ గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకోవడమేగాకుండా పలు చిత్రాల్లో నటించే అవకాశాలు కూడా దక్కించుకుంది.
కాగా ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో బాగానే యాక్టివ్ గా ఉండడమేగాక అందమైన ఫోటోలను కూడా షేర్ చేస్తూ రోజురోజుకి తన ఫాలోవర్ల సంఖ్యా పెంచుకుంటోంది.
అయితే తాజాగా ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించినటువంటి ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొంది.
ఇందులో భాగంగా తన లేలేత అందాలతో ఫోటోలకి ఫోజులిచ్చింది.అలాగే ఈ ఫోటోలన్నీ తన అధికారిక సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అంతేకాక నెటిజన్లు కూడా అవకాశాల కోసం కొంత మేర గ్లామర్ డోస్ పెంచిందని అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు ఇటీవల కాలంలో “ఏడు చేపల కథ” అనే చిత్రంలో నటించింది.ఈ చిత్రంలో ఈ అమ్మడు పాత్ర కొంతమేర బోల్డ్ తరహాలో ఉంటుంది.
కాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినప్పటికీ ఈ అమ్మడి పాత్రకు మాత్రం సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందాయి.కాగా ప్రస్తుతం ఈ అమ్మడు పలు టాలీవుడ్ చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.
అలాగే పలురకాల షోలు ఈవెంట్లలో కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.