ఢిల్లీ పర్యటనలో తెలంగాణ బీజేపీ నేతలు బిజిబిజీగా గడుపుతున్నారు.ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హస్తినలో పర్యటిస్తున్నారు.
ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇరువురు కలిసే అవకాశం ఉంది.తెలంగాణలో పార్టీ బలోపేతంపై జాతీయ నేతలతో చర్చిస్తున్నారు బండి సంజయ్.
అక్రమ అరెస్ట్ సంఘటనా వివరాలను అమిత్ షాకు వివరించనున్నారు.మరోవైపు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది.
అదేవిధంగా ఈనెల 15న వరంగల్ లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నట్లు బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.