ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ శ్రియా సరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉంటుంది.
అప్పట్లో టాలీవుడ్ లో అగ్ర హీరోలందరి సరసన నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని తెగ ఎంజాయ్ చేస్తోంది.
సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
వివాహం అనంతరం ఈమె అడపాదడపా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది.ఇక శ్రియా సరన్ కు కూతురు పుట్టినట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.
అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది.అప్పుడప్పుడు తన భర్తతో కలసి దిగిన ఫోటోలను వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా తన కుమార్తె రాధతో కలసి వెకేషన్ లో సందడి చేస్తున్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. తన భర్త ఆండ్రీ కోషివ్, కూతురు రాధ తో కలసి గోవాలో ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ఈ క్రమంలోనే అక్కడ దిగిన ఫోటోలను షేర్ చేసింది.గోవా బీచ్ లో తన కూతురు చేతులు పట్టుకొని నడిపిస్తు శ్రీయ తన తల్లి ప్రేమను చూపిస్తుంది.కుమార్తె తో పాటు తన భర్త తో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది.భర్తతో కలసి నీళ్లలో మునిగి ఉన్న సెల్ఫీ లను షేర్ చేస్తూ లవ్ అండ్ హ్యాపీనెస్ టూ యు ఆల్, అని గ్రేట్ ఫుల్ అంటూ ఫేస్ ఇమోజి తో మరొక స్టోరీలో కాప్షన్ ను ఇచ్చింది.
అలాగే స్నాప్ చాట్ లో శ్రియా సరన్ ట్యాంక్ టాప్,షార్ట్ ధరించి కొబ్బరి చెట్టు పై వయ్యారంగా వాలుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.అందులో నీలి సముద్రం, ఆహ్లాదకరంగా ఉంది.
ఈ స్టోరీని ఉద్దేశించి హ్యాపీ హాలిడేస్ గాయ్స్ అంటూ కాప్షన్ ను రాసుకొచ్చింది ఈ బ్యూటీ.