టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పటికప్పుడు సరికొత్తగా ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాడు.ఈయన తన కొత్త సినిమాలను ప్రేక్షకులకు చేరవేయడంలో కొత్త వే ని ఉపయోగించు కుంటాడు.
ఈయన సినిమా ప్రొమోషన్స్ చేసే విధానం కొత్తగా ఉండడం వల్ల జనాలకు బాగా చేరువ అవుతాయి.ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా ప్రొమోషన్స్ లో కూడా ఇదే స్ట్రేటజీని వాడుతున్నారు.
అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సర్కారు వారి పాట.మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట‘ సినిమా గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది.కానీ ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇటీవలే ఊర మాస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ అందుకుంటుంది.
ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమా విషయంలో మేకర్స్ నిన్న ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పారు.
ఆ సర్ప్రైజ్ ను ఈ రోజు రివీల్ చేసి మరొక ఆసక్తిని క్రియేట్ చేయడంలో సఫలం అయ్యారు.
ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ఏ సినిమాకు కూడా చేయని విధంగా ఈ సినిమాకు ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు.ట్విట్టర్ లో ఈ సినిమా హ్యాష్ ట్యాగ్ పై మహేష్ బాబు స్పెషల్ ఎమోజీని తీసుకొచ్చారు.ఈ ఎమోజీ ట్విట్టర్ లో యాక్టివ్ కూడా అయ్యింది.
మూడు హ్యాష్ ట్యాగ్స్ లో ఈ ఎమోజీలు కనిపిస్తున్నాయి.ఇది ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అయ్యింది.
మొత్తానికి మహేష్ బాబు టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసారు.